వాగ్దానాలు, హామీలు అందరూ ఇస్తారు. కానీ వాటిని నేరవేర్చే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే.. సమస్యలు అందరూ వింటారు. విన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా కొందరికి మాత్రమే ఉంటుంది. సియం కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి సత్తా ఉన్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.
మరోసారి హరీష్ రావు తన నాయకత్వ, పరిపాలన పటిమను చాటుకున్నాడు . నిజంగానే ఆయన జనం మెచ్చిన నేత అని నిరూపించుకున్నాడు. ఇతర నాయకులకు స్వయంగా కలిసి సమస్యలను విన్నవించుకున్నా.. సమస్య పరిష్కరం అవుతుందో లేదో చెప్పడం కష్టం. కానీ.. హరీషన్న రూటే సపరేట్.. మన జన హ్రుదయనేతకు సమస్యను ఫోన్ చేసి చెప్పినా.. మేసేజ్ రూపంలో పంపినా చాలు.. కేవలం గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తారు.
ఈ విషయం మరోసారి నిరూపితమైంది.సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి మహాత్మ జ్యో తిరావు పూలే సాంఘిక సంక్షేమ హాస్టల్ కు చెందిన విద్యార్థులు గత కొంత కాలంగా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు. వారు నీళ్లు లేకపోవడంతో సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు పిల్లలు క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక టీఆర్ఎస్ నేతలు.. మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లారు. మెసెజ్ రూపంలో సమస్యను తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు .. మరోసటి రోజు ఉదయాన్నే అధికారులను అప్రమత్తం చేసి.. హాస్టల్ అధికారులను పంపారు. విద్యార్థుల సమస్యను తెలుసుకున్న అధికారులు నీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించారు. అలాగే..విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కూడా ఆరా తీశారు.