Home / NATIONAL / ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం

ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సోనియా గాంధీ తనయ.. ఆ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ సోదరీమణి అయిన ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.

గత ఎనిమిదేండ్లుగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీస్తూ రాహుల్ గాంధీ ఈ యాత్ర చేస్తున్నారు. తాజాగా అదే బాటలో ప్రియాంక గాంధీ నడవనున్నారు అని తెలుస్తుంది.  వచ్చేడాది రెండు నెలల పాటు ప్రియాంక గాంధీ మహిళా మార్చ్ పేరుతో నిర్వహించనున్నారని  ఆ పార్టీకి చెందిన ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

వచ్చే జనవరి ఇరవై తారీఖు నుండి మార్చి ఇరవై తారీఖు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల నగరాల్లో ఇది జరుగుతుందని ఆయన వివరించారు. అయితే రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ముగిసే రోజున ప్రియాంక గాంధీ మహిళా మార్చ్ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ విశేషం..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat