Home / SLIDER / అంబేద్కర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన నివాళి

అంబేద్కర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన నివాళి

భారతరాజ్యాంగ నిర్మాత.. భారతరత్న..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66.వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి గారు అంబేడ్కర్ గారు దేశానికి చేసిన సేవ‌ల‌ను నెమరు వేసుకున్నారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అణగారిన అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని, అంతే కాకుండా అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మంత్రి గారు గుర్తుచేశారు.భవిష్యత్ తరాలకు కూడా అంబేద్కర్ గుర్తు ఉండే విధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల తన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కు శ్రీకారం చుట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నేటి యువ‌త అంబేద్క‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకుని, ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాల‌ని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి, పలువురు అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat