కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ ఆస్తానా ఈ మెహబూబియా చమాన్ దర్గా కాద్రియ మంజూర్ షా ఖాద్రీ వద్ద నిర్వహించిన సందల్ షరీఫ్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాదర్ సమర్పించారు. అనంతరం ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రషీద్ బైగ్, హుస్సేన్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, సురేష్, దిలీప్, మల్లేష్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, మహేష్, ఇమ్రాన్ బయిగ్, నారాయణ, హమీద్ తదితరులు పాల్గొన్నారు.