Home / SLIDER / సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావు

సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావు

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

డబ్బులు సంపాదించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని మంత్రి అన్నారు. పేద గ్రామీణ యువత ఉన్నత విద్యను చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి ఈ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం రాజా బహదూర్ వెంకట రామారెడ్డి చేసిన కృషి ఈరోజు ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థినిలకు అవకాశాన్ని కల్పించిందని కొనియాడారు. పేద గ్రామీణ యువతకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందించేందుకు ప్రపంచ స్థాయి విద్యా సంస్థ, వసతి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేయడం కోసం బద్వేల్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం కేసీఆర్‌ గొప్ప మనసు చాటుకున్నారన్నారు.

భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ పి.వి.నరసింహారావు, స్వర్గీయ శ్రీ రావి నారాయణరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎస్. జైపాల్ రెడ్డి, జస్టిస్ ఎ. సీతారాంరెడ్డి, జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, తదితర ప్రముఖులు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి హాస్టల్లో ఉన్నవారే అని మంత్రి పేర్కొన్నారు.ఈ భవన నిర్మాణానికి రూ. ఐదు కోట్ల నిధులను త్వరలో విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి, రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri