కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ స్ప్రింగ్ విల్లా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో నెలకొన్న దోమల బెడద, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, పార్క్ ల అభివృద్ధి, డంపింగ్ యార్డును వేరొక చోటకు మార్చాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారిని కోరారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి త్వరలో ఆయా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, స్థానిక కార్పొరేటర్ మీనా సునీల్ రెడ్డి, దేవి చందు ముదిరాజ్ మరియు స్థానిక ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.