సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, అర్ అండ్ బి గెస్ట్ హౌజ్, భవనాలను ప్రారంభించారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో స్థానిక స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సారధ్యంలో పటాన్ చెరు నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారు..10కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం సంతోష దాయకమైన విషయం .ఫ్రీడం పార్కు,ఆర్ అండ్ బి అతిధి గృహం, డిసిసిబి బ్యాంకు, వార్డు కార్యాలయం వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవటం ఆనందదాయకం.
కాలుష్య కోరల్లో ఇబ్బంది పడుతుండే పటాన్ చెరు నేడు రోజురోజుకు అభివృద్ధి పధంలో దూసుకుపోతుంది .త్వరలొనే ఐటీ సేవల విస్తరణకు పటాన్ చెరు కేంద్రం కాబోతుంది .ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తధ్యం.సంగారెడ్డికి మెడికల్ కళాశాల, పటాన్ చెరు కు 2వందల పడకల ఆసుపత్రి మంజూరు చేయటం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి .కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసింది.కోచ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయారు . దక్షిణ భారత దేశం అభివృద్ధిలో బిజేపికి చిన్నచూపు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.