ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి… ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ నగరంలోని బేగంపేట లోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవం లో మంత్రి తలసాని పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం .
చెరువులపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ “దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తుంది.
రాష్ట్రంలోమత్స్య సంపద గణనీయంగా పెరిగడంతో రానున్న రోజుల్లో చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుంది” అని ఉద్ఘాటించారు.