తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని కవిత ట్వీట్ చేశారు.
‘కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనాడు.. భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు.. జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై భారత్’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో పోస్టు చేశారు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 27, 2023