Home / TELANGANA / ఆర్మూర్‌లో నిజామాబాద్‌ రైతుల సమావేశం…పసుపు బోర్డుపై చర్చ..!

ఆర్మూర్‌లో నిజామాబాద్‌ రైతుల సమావేశం…పసుపు బోర్డుపై చర్చ..!

నిజామాబాద్ రైతులు మళ్లీ పసుపు బోర్డుపై పోరాట బాట పట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. నెల రోజుల్లో పసుపు బోర్డు నిజామాబాద్‌కు తీసుకువస్తానని, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇప్పిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీని నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు నిజామాబాద్ రైతులు. వాస్తవానికి టీఆర్ఎస్ ఎంపీగా కవిత గత ఐదేళ్లలో పలుసార్లు పార్లమెంట్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై మాట్లాడింది. అంతే కాకుండా పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలంటూ మెమెరాండంలు ఇచ్చింది. అయితే అరవింద్ చేసిన వాగ్ధానాన్ని నమ్మి అతడికి పట్టం కట్టారు. లోక్‌సభ కలు అయిపోయి మూడు నెలలైనా బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఊసే ఎత్తడం లేదు సరికదా..బీజేపీ కార్యకర్తలనే రైతుల ముసుగులో తీసుకువెళ్లి పసుపు బోర్డు అవసరంలేదన్నట్లుగా డ్రామాలు ఆడిస్తున్నాడు. దీంతో నిజామాబాద్ రైతులు అరవింద్  మోసంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఇవాళ ఆర్మూర్‌లోని మార్కెట్‌ యార్డులో సమావేశమైన నిజామాబాద్ రైతన్నలు పసుపు బోర్డు సాధనపై వాడీవేడిగా చర్చించారు. గత ఎంపీ ఎలక్షన్లలో గెలిచిన నెలరోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎలక్షన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ, అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ను ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. కానీ, అతను ఈవిషయంపై ఇప్పటికీ చొరవ చూపకపోవడం శోచనీయమనీ, కనీసం ఎర్రజొన్న మద్ధతు ధరను సైతం పెంచడంపై కూడా వారు దృష్టి సాధించడం లేదని ఈ సందర్భంగా రైతులు అతనిపై మండిపడ్డారు. అరవింద్ అబద్ధాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతన్నలు మళ్లీ పసుపు బోర్డ్ సాధనకై పోరుబాట పట్టబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అరవింద్ మోసంపై నిజామాబాద్ రైతన్నలు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat