తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళసై సౌందర్ రాజన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం నిమిత్తం రాజ్భవన్ చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవం వందనంతో స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్గా సౌందర్ రాజన్తో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు కానున్నారు.
