భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ ఐసీసీ వన్డే బ్యాట్స్వుమన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్ వన్కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్వుమన్ ఎలీస్ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్వైట్ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి 652 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా బౌలర్ మారిజానె క్యాప్ (656) అగ్రస్థానంలో ఉంది. తాజా వన్డే సిరీస్లో ఇంగ్లాండ్పై 2-1తో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. 2021లో నిర్వహించే ఐసీసీ మహిళల ప్రపంచకప్ కోసం ఇప్పటికే వన్డే ఛాంపియన్షిప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలోనే మిథాలీసేన దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది.
