తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ ప్రాజెక్టు నమూనా, నాణ్యత, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి రావడంతో నిరుపేదల ఆశ నెరవేరబోతోంది. జియాగూడలో శిథిలావస్థకు చేరిన గృహ సముదాయాల స్థానంలో గతేడాది జులైలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ వెంట జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు, వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నారు. కేటీఆర్ను చూసేందుకు స్థానిక ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
