తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్కు 46%, ఉత్తమ్కుమార్రెడ్డి (కాంగ్రెస్)కి 25%, కిషన్రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్ కోదండరాంకు 7%, అసదుద్దీన్ ఒవైసీకి 4% మద్దతు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్ స్టాక్ ఎక్సే్ఛంజ్’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది.