కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు.
కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని ముఖ్యమంత్రి అభ్యర్థించారు.