ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా మెలుగుతూ, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవాళ మరోసారి ఇరుసీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
