టీమిండియా నిన్న వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20 లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాట్టింగ్ కు వచ్చిన కరేబియన్ జట్టు నిర్ణిత 20ఓవర్స్ లో 146 పరుగులు చేయగా..భారత్ ఆ టార్గెట్ ను చేధించింది. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసి విజయాన్ని అందించారు. ఇక పంత్ విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ ధోని విరామం తీసుకోవడంతో తన ప్లేస్ లో వచ్చిన పంత్, మొదటి రెండు మ్యాచ్ లలో దారుణంగా విఫలం అయ్యాడు.అయితే మ్యాచ్ గెలిచాం కాబట్టి అతడిపై అంతగా ప్రభావం చూపలేదు. అదే ఆటను మూడో మ్యాచ్ లో కూడా ప్రదర్శిస్తే అతడిపై వేటు పడే అవకాశం ఉండేదని అందరు అనుకునే సమయంలో ఈ మ్యాచ్ లో 65రన్స్ కొట్టి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పంత్ సేఫ్ జోన్ లో పడ్డాడు.