రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను ఎదో చేసాడని కాదు, తాను చేసిన తప్పులు సరిదిద్దుకోలేకపోతున్నాడు కాబట్టే. మొదటి మ్యాచ్ లో చాలా తప్పులు చేసిన పంత్ ఈ మ్యాచ్ లో కూడా విచిత్రమైన సంఘటనకు తెరలేపాడు. చాహల్ బౌలింగ్ లో లిటన్ దాస్ ను స్టంప్ ఔట్ చేసాడు. కాని పంత్ బంతిని వికెట్ల ముందు పట్టడంతో నాటౌట్ గా ఇచ్చారు. ఇది ఒక్కటే కాకుండా చిన్న చిన్న తప్పులు చేస్తూనే వచ్చాడు. దీంతో నువ్వు ఎప్పటికీ ధోనికి శిష్యుడివి కాలేవని నెటీజన్లు ఫైర్ అయ్యారు.
