న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కివీస్. బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 50ఓవర్స్ లో ఏకంగా 347 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చూసి ఇక విజయం ఇండియాదే అనుకున్నారంతా కాని అక్కడే అందరు అత్యాశ పడ్డారని చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా అంత టార్గెట్ ను అలోవోకగా చేజ్ చేసారు కివీస్ ఆటగాళ్ళు. అద్భుతమైన బ్యాట్టింగ్ తో టేలర్ సెంచరీ సాధించాడు. మరోపక్క కెప్టెన్ లాథమ్, ఓపెనర్ నికోలస్ అర్ధశతకాలు చేసారు. ఇక స్కోర్ బోర్డు చూసుకుంటే..!
ఇండియా బ్యాట్టింగ్ :
ఐయ్యర్-103
రాహుల్-88*
కోహ్లి-51
న్యూజిలాండ్ బ్యాట్టింగ్:
టేలర్-109
నికోలస్-78
లాథమ్-69