తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. అందరికి అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన ట్వీట్ చేశారు.
‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి అన్నింటా శుభం జరగాలి. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.’ అని ట్విట్టర్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి అన్నింటా శుభం జరగాలి. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు
Wishing you all a very #HappyDeepavali pic.twitter.com/mCEiOWqn8r
— Harish Rao Thanneeru (@trsharish) October 24, 2022