Home / SLIDER / చెరువుల్లో నీలి విప్లవం మత్స్యకారుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు..

చెరువుల్లో నీలి విప్లవం మత్స్యకారుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు..

 తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులు నిండాయని వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్  ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.ఖిలా వరంగల్ గుండు చెరువు, దేశాయిపేట లోని చిన్న వడ్డెపల్లి చెరువు,కోట చెరువుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో చేపలు వదిలారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువులను పునరుద్ధరించి చెరువులకు కొత్త కళ తీసుకొచ్చారన్నారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చెరువులే ఆధారం అని ఆ చెరువులను బాగు చేయడం ద్వారా కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవం పోశారన్నారు.. చెరువులో చేపపిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులకు ఆర్థిక పరిపుష్టి సాధించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నారన్నారు.. తెలంగాణ సాధించిన ఫలాలు పేద ప్రజలకు అందజేస్తున్నారు..

ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సంకల్పంతో సంక్షేమం అభివృద్ధి లో దేశంలోనే ముందువరుసలో నిలిపారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి అడ్డుకోలేరు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళుతుంది.. వరంగల్ తూర్పు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నాం ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేస్తున్నాం పేదరికం నిర్మూలించడం ఎజెండాగా పనిచేస్తున్నామన్నారు..ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు బైరబోయిన ఉమ దామోదర్ యాదవ్,బోగి సువర్ణ సురేష్, సురేష్ జోషి,కావటి కవిత రాజుయాదవ్,మాజీ కార్పోరేటర్ బయ్య స్వామి,సంగరబోయిన చందర్,చింతాకుల సునీల్,మత్సకార సొసైటీ ప్రతినిదులు,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు,

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat