ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి సుచరిత పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి సుచరిత స్పందించారు. తాను మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటాను. పార్టీ మారితే ఇంటికే పరిమితం అవుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక పార్టీలో ఎవరు తప్పు చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందని, ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని సుచరిత తెలిపారు.