ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల వివాదం ఇంకా తీవ్రరూపం దాల్చుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీలో పెను దుమారం రేపింది.
ఈ క్రమంలో ఆయన చేసిన రాజ్యాంగంపై వ్యాఖ్యల గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు.
అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని మండిపడ్డారు. వయసు పైబడటంతో ఆయనకు బుద్ధి మందగించిందని, వెంకటగిరిలో నక్సల్స్ ఉన్నారని మాట్లాడుతున్నారని విమర్శించారు. చాలారోజుల నుంచే ఆనం, శ్రీధర్రెడ్డిలు టీడీపీతో టచ్ ఉన్నారని తెలిపారు.