అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్లు, అమ్మఒడి (102 సర్వీస్) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి.
రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు మొదటి నుంచి ఉన్నాయి. గర్భిణుల కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా అమ్మఒడి వాహనాలను 2017-18లో ప్రారంభించారు. పార్థివదేహాలను తరలించేందుకు ‘హర్సె’ వాహనాలను 2016-17లో ప్రవేశపెట్టారు.
ఈ మూడు రకాల వాహనాలు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు 1.03 కోట్ల మంది వీటి ద్వారా లబ్ధి పొందారు. 108, 102, హర్సె కలిపి ప్రస్తుతం 776 వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
వీటికి అదనంగా వైద్యారోగ్యశాఖ కొత్తగా 466 వాహనాలను కొనుగోలు చేసింది. ఇందులో 204 అంబులెన్సులు, 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలు ఉన్నాయి. వీటిని మంగళవారం హైదరాబాద్లోని నెక్లెస్రోడ్ వేదికగా ప్రారంభించనున్నారు. ఇందులో 437 వాహనాలను ప్రస్తుతం ఉన్నవాటిలో కాలం చెల్లిన వాహనాల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. వీటి రాకతో సేవల్లో వేగం, విస్తృతి మరింత పెరుగనున్నది.