తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారుల సమక్షంలో అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరో రోజు పాదయాత్రను ప్రారంభించారు.
ప్రజలందరూ మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పాదయాత్ర కొనసాగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలనగర్ డివిజన్లో కొన్ని సంవత్సరాలుగా కానీ పనులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల లో పరిష్కారం చేసామని అందులో భాగంగానే ట్రాఫిక్ ని నిర్మూలించుటకై బాలనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాము..
రోడ్లు డ్రైనేజ్ పనులను పూర్తి చేశామని పెండింగ్లో ఉన్న పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు ఆదేశించారు.. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు డబుల్ బెడ్ రూమ్ మరియు పింఛన్లకు సంబంధించి వినతి పత్రాలు అందించగా వెంటనే అవి అధికారులకు అందించి పరిశీలన చేయాలని ఆదేశించారు..