తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ స్ఫూర్తి తో గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బాగుండాలమ్మ టీం మొక్కలు నాటారు .
ఈ ఆల్బమ్ కి దర్శకత్వం వహించిన బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలను ప్రేమించే వ్యక్తి నాయకుడైతే ప్రకృతి ని ప్రేమించే వ్యక్తి దేవుడు , సీఎం కేసీఆర్ గారు దేవుడు .
అయన బాటలో నడుస్తూ అయన స్ఫూర్తి తో హరితహారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి పచ్చదనం పెంపు పైన ప్రజలకు అవగాహాన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఏంతో కృషి చేస్తున్నారు . ఈ సందర్బంగా నటీనటులు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం లో అందరు భాగస్వామ్యం కావాలని కోరారు