ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి రెండు బంతులు డాట్ అవ్వగా..మూడో బంతి 6గా మలిచాడు.తర్వాత బంతి టూడీకి ప్రయత్నించగా గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కు తగిలి అది బౌండరీకి వెళ్ళింది. దీంతో అంపైర్ 6పరుగులు ఇవ్వడం జరిగింది.దీనిపై సీనియర్ మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్ తప్పుబట్టారు.బాట్స్ మెన్ రెండో రన్ ప్రయత్నిస్తున్న సమయానికి బాల్ త్రో రావడంతో ఆ రన్ పరిగణలోకి రాదని అన్నారు.దీంతో ప్రతీ ఒక్కరికి అదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.అవసరమైతే ఇద్దరికీ విన్నింగ్ ఇవ్వాలని సీనియర్లు సైతం చెబుతున్నారు.