స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లు గా ఎంపికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధుల కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.