ప్రపంచకప్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ తో సెమీస్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇందులో ఇండియా 18పరుగుల తేడాతో ఓడిపోయింది.మాజీ కెప్టెన్ ధోని, జడేజా కలిసి మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసిన దగ్గరకు వచ్చి ఓడిపోయారు.అయితే దీనిపై స్పందించిన మాజీ భారత బౌలర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్సింగ్ ధోని పై విమర్శలు చేసాడు.ధోని అలా ఆడడం సరికాదని.. ధోని ఇప్పటికే ఎక్కువ క్రికెట్ ఆడాడని ఇలాంటి సమయంలో ఎలా ఆడాలో అతనికి తెలిసే ఉంటుందని అలాంటిది ఎందుకు ఆడలేదని ఆయన అన్నారు. అటు హార్దిక్ పాండ్య,జడేజా పై ఒత్తిడి పెట్టడం కరెక్ట్ కాదని,యువరాజ్ సింగ్ అలా ఎప్పుడు ఎవరిపై ఇలా చేయలేదు అన్నాడు.
అయితే యోగ్రాజ్సింగ్ పై ఫాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకరిపై విమర్శించినప్పుడు కొంచెం అలోచించి మాట్లాడాలని,ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫలితం వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.ఒకప్పుడు టీ20 ఫైనల్ ఓడిపోవడానికి కారణం మీ కొడుకేనని అయితే ఆ సమయంలో అతడిపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని,కేవలం మీ కారణం వలనే మీ తనయుడి భవిష్యత్తు ఇలా అయ్యిందని నేటీజన్లు ఫైర్ అయ్యారు.