ప్రపంచ కప్పే లక్ష్యంగా భరిలోకి దిగిన భారత్ ఆసలు సెమీస్ తోనే ఆగిపోయాయి.లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీఫైనల్కు వెళ్ళిన ఇండియా అక్కడనుండి మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయింది.సెమీస్ లో న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓడడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.అసలు భారత్ ఈ టోర్నీకే హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టి చివరికి సెమీస్ లో ఓటమిపాలైంది.దీంతో బీసీసీఐ బాగా సీరియస్ గా ఉందని తెలుస్తుంది.ఆ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలు గుర్తించిన అధికారులు వాటిపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు మేనేజ్ మెంట్ ను వివరణ కోరనున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే కమిటీ ఆప్ అడ్మినిస్ట్రేటర్స్ వీరిని మూడు తప్పిదాలపై వివరణ కోరనున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ జట్టు ఎన్నిక సమయంలోనే రిషబ్ పంత్, అంబటి రాయుడు లను స్టాండ్ బై ఆటగాళ్ళుగా సెలెక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు జట్టులోఎంపికైన 15మంది ఆటగాళ్లలో ఎవరైనా గాయపడినా, ఏదైనా కారణాలతో తప్పుకున్నా వీరిద్దరికీ అవకాసం ఇవ్వాల్సిందే.రిషబ్ పంత్ ఓపెనర్ శిఖర్ ధవన్ బదులుగా అవకాశమిచ్చారు.అనంతరం ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడ్డాడు.ఐతే ఇతడి ప్లేస్ లో కచ్చితంగా రాయుడునే రావాల్సి ఉంది.కాని ఈ ఆంధ్రా ఆటగాడ్నిపక్కన పెట్టి లిస్టు లో లేని మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. రాయుడిని విషయంలో ఇలా ప్రవతించడానికి గల కారణం ఏమిటనేది కూడా బీసీసీఐ వివరణ కోరనుంది. ఇక సెమీఫైనల్ లో ధోని ఆలస్యంగా ఎందుకు దిగాడు. అతడు ఇంకాస్త ముందు దిగితే మరిన్ని పరుగులు వచ్చేవని పూర్తిగా చివర్లో దిగడం వల్ల ఒత్తిడితో స్వేచ్చగా షాట్లు ఆడలేకపోయాడని అభిమానులే కాదు క్రికెట్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూడా బిసిసిఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది.ఈ మ్యాచ్ లో ఏకంగా నలుగురు వికెట్ కీఫర్లను ఎందుకు అనేదానిపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.