భారత, పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ విషయంలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న తరుణాన..ఓ పాక్ యువకుడు..భారత సంతతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుబాయ్లో చోటుచేసుకుంది. ఈఘటనలో దుబాయ్ పోలీసులు సదరు పాక్ యువకుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..దుబాయ్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక జూన్ 16 న ట్యూషన్కు వెళ్లింది. అయితే కొన్ని పేపర్లు ఇంటి దగ్గర మర్చిపోవడంతో వాటిని తెచ్చుకునేందు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో లిఫ్ట్లో చొరబడిన ఓ పాకిస్తాన్ యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు..ఆ బాలిక ప్రైవైట్ పార్ట్స్పై చేతులు వేస్తూ, అడ్రస్ అడుగుతూ…లైంగికంగా వేధించాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ టీచర్కు ఈ విషయం చెప్పింది. వెంటనే ఆ టీచర్ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గదిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా, సదరు డెలివరీ బాయ్గా పని చేసే పాకిస్తాన్ యువకుడు ఐదో అంతస్థులో డెలివరీ ఇవ్వకుండా…లిఫ్ట్లోకి బలవంతంగా ప్రవేశించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం బయటపడింది. పాకిస్తాన్ యువకుడి దురాగతంపై టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఆల్-ఱపా పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. భారత సంతతి బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో పాకిస్తాన్ కీచకుడికి కఠిన శిక్షలు విధించాల్సిందే అని దుబాయ్లో స్థిరపడ్డ భారతీయులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ ఇష్యూలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న తరుణంలో ఈ ఘటన దుబాయ్లో తీవ్ర కలకలం రేపుతోంది.
