శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. అనంతరం వచ్చిన తెలుగు కుర్రోడు హనుమా విహారి తో కలిసి పుజారా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి అర్దశతకాలు పూర్తి చేసారు. ఇక కెప్టెన్ కోహ్లి విషయంలోనే అందరికి బెంగగా ఉంది. అతడి ఆట చూస్తుంటే కోహ్లికి ఏమైంది అని అంటున్నారు. ఇక టీ సమయానికి భారత స్కోర్ 5వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
