కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరిని వణికిస్తున్న విషయం తెలిసిందే. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటికి వరకు ఫుట్ బాల్ ప్రియులకు చేదు అనుభవం చూపించిన వైరస్ ఇప్పుడు క్రికెట్ పై కూడా పడింది. సాదారణంగా ఇండియా ఆటగాళ్ళు అంటే అందరికి ఎంతో గౌరవం కనిపించగానే కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడు ప్లేయర్స్ దగ్గరికి రావడానికి కూడా బయపడుతున్నారు. ఇదంతా కరోనా మహిమ అనే చెప్పాలి. మార్చి 12 నుండి సౌతాఫ్రికా తీమిండియాతో వన్డే సిరీస్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లలో భారత్ ఆటగాళ్లకు కరచాలన ఇవ్వకూడదని అనుకున్నారట. అంతేకాకుండా వీరితో పాటుగా స్పెషలిస్ట్ వైద్యులు కూడా రాబోతున్నారని సౌతాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ చెప్పారు.
