ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని గజగజ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇది రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. అయితే గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం నాడు దీనికి సంబంధించిన వాక్సిన్ ట్రైల్ వేయనున్నారు. సీటెల్లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో జరుగుతున్న ఈ టెస్ట్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు. కాని ఈ వాక్సిన్ ను పూర్తిగా ధృవీకరించడానికి ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రజారోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ టెస్ట్ 45 మంది యంగ్ మరియు ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ప్రారంభం కానుంది. వీరిపై షాట్ల నుండి వ్యాధి బారిన పడే అవకాశం లేదు, ఎందుకంటే వారు వైరస్ కలిగి లేరని అన్నారు.