గ్రేటర్ వరంగల్ 43, 44 డివిజన్ల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పసునూరి కుమారస్వామి గారి కుమార్తె పసునూరి గ్రీష్మ NIT నాగపూర్ లో Btech రెండవ సంవత్సరం చదువుతోంది.
అయితే కళాశాల ఫీజు చెల్లించేందుకు తగిన ఆర్థిక స్తొమత లేక ఎమ్మెల్యే గారిని సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు విద్యార్థిని గ్రీష్మకు హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు.
దింతో అడిగిన వెంటనే తమకు సహాయం అందించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి విద్యార్థిని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.