Home / SLIDER / మంత్రి జగదీష్ రెడ్డి చేసిన పనికి అందరూ ఫిదా..?

మంత్రి జగదీష్ రెడ్డి చేసిన పనికి అందరూ ఫిదా..?

నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడికి హామీ ఇచ్చి అమలు చేసి అండగా నిలిచి ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడు అయ్యాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన షేక్ నజీర్ పాషా జ్యూస్ బండి నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. నజీర్ పాషా కు షుగర్ వ్యాధి రావడంతో తన రెండు కాళ్లు తీసివేయడం జరిగింది.

నిమ్స్ లో ఆపరేషన్ సమయంలో ప్లాస్టిక్ కాళ్ళ ఏర్పాటుకు మంత్రి జగదీష్ రెడ్డి గారు ( LOC ద్వారా 3లక్షల రూపాయలను అందించారు ) అనంతరం కుటుంబం గడవడం ఇబ్బందిగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి గారిని కలిసి జ్యూస్ బండి ఏర్పాటు చేయాల్సిందిగా అందుకు తగిన సహాయం అందించమని నజీర్ పాష కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా నీకు కావలసిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రపంచా వికలాంగుల దినోత్సవ సందర్భంగా సదరు బాధితుడు నజీర్ పాషకు ప్లాస్టిక్ కాళ్ల నిమిత్తం 4.50 లక్షల రూపాయలను అందజేశారు.

అంతేకాకుండా త్వరలో జ్యుస్ దుకానాన్ని ఏర్పాటు చేయించి తాను స్వయంగా వచ్చి ప్రారంభిస్తానన్న మంత్రి ఆ మేరకు శుక్రవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో సదరు వికలాంగుడి జ్యూస్ బండిని ప్రారంభించి ఆ కుటుంబానికి బతుకుదెరువును చూపించారు. దీంతో వికలాంగుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ మా జీవితాంతం మంత్రి జగదీష్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే హామీ ఇచ్చి అమలు చేసి అండగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు ఓ వరమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat