తెలంగాణ రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది.
అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ తో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఓ డ్రామా. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉంది. ఎమ్మెల్యేలు ఎటు పోయారో ఇన్ని రోజులు కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలియదా?’ అని సంజయ్ ప్రశ్నించారు.