Home / MOVIES / కళాతపస్వి కే.విశ్వనాథ్‌ పార్థీవదేహానికి మంత్రి తలసాని నివాళులు

కళాతపస్వి కే.విశ్వనాథ్‌ పార్థీవదేహానికి మంత్రి తలసాని నివాళులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్‌ హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెల్సిందే.

ఆయన పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులర్పించారు. ఆయ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యావత్‌ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.

కళలు, సామాజిక స్పృహ ఉన్న గొప్పవ్యక్తి అని, తన సినిమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. శంకరాభరణం చిత్రం ప్రతి ఒక్కరినీ కదిలించిందని తెలిపారు.

విశ్వనాథ్‌ను అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయని వెల్లడించారు. ఆయన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలు తీశారన్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat