Home / SLIDER / మణిపూర్ ఘటనను ఖండిస్తూ నిరసన శాంతి ర్యాలీ..

మణిపూర్ ఘటనను ఖండిస్తూ నిరసన శాంతి ర్యాలీ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనను ఖండిస్తూ సూరారం మెయిన్ రోడ్ నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు క్రైస్తవ, ముస్లిం, హిందూ సోదరులు మరియు మానవతవాదులు నిరసన తెలుపుతూ నిర్వహించిన శాంతి ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పాల్గొని సంగిభావం వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులాలు మతాలు అతీతంగా బ్రిటిష్ వారితో పోరాడి తెచ్చుకున్నా భారతదేశం నేడు కుల మాత బేదాభిప్రాయాలతో విబజించి పాలించడం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది.

బీజేపీ అంటేనే బ్లాక్ మెయిలింగ్, మతవిద్వేషాలు, ప్రాంతీయవిద్వేషాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ప్రమాదకరంగా మారింది అని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలను విషయంలో విఫలమైంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat