తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు . ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి పార్టీ తరపు నుండి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన కోటిన్నర రూపాయిలలో కోటి రూపాయిల ఆర్థిక సహాయాన్ని శ్రీమతి రజిని సాయచంద్, కూతురు మినాల్, కొడుకు చరిష్ కు గుర్రంగూడాలోని వారి నివాసంలో కలిసి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడిచిన దివంగత బిఆర్ఎస్ నేత సాయి చంద్ తన పాటతో తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహా కళాకారుడు. తన ఆట పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అడుగులో అడుగుగా ప్రతి బహిరంగ సభల్లో తన ఆటాపాటతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. దురదృష్టవశాత్తు కాలం చేశారు. ఈ నేపధ్యంలో బాధ్యత గల తండ్రి స్థానంలో సాయి చంద్ కుటుంబాన్నిఆదుకున్నారు కేసీఆర్.
వారి కుటుంబానికి అండగా ఉంటూ సాయి చంద్ గారి సతీమణి రజనీ గారిని వెంటనే గిండంగుల కార్పోరేషన్ కు చైర్మన్ గా నియమించన విషయం తెలిసిందే. వారి ఇద్దర పిల్లల భవిష్యత్ బావుండాలని, కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది ఉండకూడని పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు కేటాయించారు కేసీఆర్. మహబూబ్ నగర్ లో సాయి చంద్ గారి తండ్రి, చెల్లమ్మకు ఎమ్మెల్యే సుమన్ గారు వెళ్లి యాబై లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కోటి రూపాయిల చెక్ ని సాయి చంద్ గారి సతీమణి రజనీ గారికి అంద జేయడం జరిగింది. భవిష్యత్ లో కూడా సాయి చంద్ కుటుంబానికి ఏ లోటు కేసీఆర్ గారు కన్నతండ్రిలా వుంటారు. బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు కూడ సాయి చంద్ కుటుంబానికి అండగా వుంటాం’’ అని శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, మంచి రెడ్డి కిషన్ రెడ్డి తేలియజేశారు.