Home / POLITICS / ఐటీలో దేశంలోనే టాప్ మన హైదరాబాద్..మంత్రి కేటీఆర్

ఐటీలో దేశంలోనే టాప్ మన హైదరాబాద్..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరం లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మోతీ నగర్ లో రిజర్వాయర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వస్తే హైదరాబాద్ నగరం ఏమైపోతదోనని విమర్శించారు..కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరం పేరు వినిపిస్తుదన్నారు.

నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతాల్లో నీళ్ల కోసం నానా తంటాలు పడేవారిని, ఇప్పుడు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నామని, వేసవిలోనూ తాగునీటికి కొరత లేకుండా చేస్తున్నామన్నారు.భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో నీటి కొరత లేకుండా చూస్తామన్నారు.

హైదరాబాద్ మహానగరానికి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ఐటీలో దేశంలోనే టాప్ లో మన హైదరాబాద్ ఉందన్నారు. నగరంలోనే కాదు..గ్రామాల్లోనూ 24 గంటల కరెంటు ఇవ్వడం దేశంలోనే ఫస్ట్ అన్నారు.ప్యాక్టరీలకు, వ్యవసాయానికి కరెంటు కోతలు లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat