వచ్చే నెల ఆగష్టులో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు ఈ ఆదివారం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ ఆద్వర్యంలో సమావేశం జరగగా కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీ నుండి వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఈ టూర్ కు కోహ్లి దూరంగా ఉంటాడని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని, మూడు ఫార్మాట్లో కోహ్లినే సారధ్యం వహిస్తాడని ప్రకటించింది సెలక్షన్ కమిటీ. టీమ్ విషయానికి వస్తే..
టీ20 జట్టు:
విరాట్కోహ్లీ(కెప్టెన్), రోహిత్శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్అయ్యర్, మనీశ్పాండే, రిషభ్ పంత్(వికెట్కీపర్), కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు:
విరాట్కోహ్లీ(కెప్టెన్), రోహిత్శర్మ(వైస్కెప్టెన్), శిఖర్ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్పాండే, రిషభ్పంత్(వికెట్కీపర్), రవీంద్రజడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్కుమార్, ఖలీల్అహ్మద్, నవదీప్ సైనీ.
టెస్టు జట్టు:
విరాట్కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రోహిత్శర్మ, రిషభ్పంత్(వికెట్కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్శర్మ, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్