పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు మరణించడంతో దేశ వ్యాప్తంగా పాక్పై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తుంది.దీనితో పాక్ తో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుంది భారత్.ఇప్పుడు ఈ ప్రభావం క్రికెట్పై పడింది.ప్రపంచకప్లో భాగంగా జూన్ 16న టీమిండియా పాక్ తో ఆడాలి..కాని దేశమంతా ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకూడదని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది.అయితే దీనికి బీసీసీఐ స్పందిస్తూ..ఆ మ్యాచ్ ఆడే సమయానికి మన ప్రభుత్వం నో చెబితే టీమిండియా ఆ మ్యాచ్ ఆడబోదని బీసీసీఐ చెప్పింది.దీనికి గాను ఐసీసీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది.ఉగ్రదాడిలో అమరవీరులైన జవాన్లకు ఐసీసీ కూడా నివాళులర్పించింది.అయితే వరల్డ్కప్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు.