ప్రపంచ కప్ లో భాగంగా భారత్ సెమిస్ లో ఓడిపోయింది.నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 18పరుగుల తేడాతో టీమిండియా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.ఓపెనర్స్ రోహిత్, రాహుల్, కోహ్లి కూడా ఒక్క రన్ తో సరిపెట్టుకున్నారు.ఇంక ఆ తరువాత వచ్చిన దినేష్ కార్తీక్,పంత్,హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు గ్రీజ్ లో ఉండలేకపోయారు.ఈ టోర్నమెంట్ మొత్తం అటు కీపింగ్ లో ఇటు మిడిలార్డర్ లో పటిష్టంగా ఆడుతున్న ప్లేయర్ ఒక్క ధోని మాత్రమే అలాంటిది ప్రస్తుతం అందరు ధోని పైనే నిందలు వేస్తున్నారు.అసలు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ధోని కారణం కాదు.మాజీ భారత్ ఓపెనర్ గంభీర్ చెప్పినట్టు అసలు సెలెక్టర్ చేసిన తప్పువల్లె ఇదంతా జరిగిందని, కేవలం 15టెస్ట్ లు,30 వన్డేలు ఆడిన వాళ్ళని సెలక్షన్ కమిటీలో ఉంచితే ఇలానే ఉంటుందని ఇదివరకే గంభీర్ స్టేట్మెంట్లు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ధావన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు అని చెప్పాలి.ఇక మిడిలార్డర్ విషయానికి వస్తే శంకర్ గాయం కారణంగా ఇంటికి వచ్చేయగా అతడి స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా బెంచ్ కే పరిమితమయ్యాడు.ఇక రాయుడు విషయానికి వస్తే అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే చివరిగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రాయుడు మంచిగా ఆట ఆడిన విషయం అందరు గుర్తుపెట్టుకున్న సేలేక్టర్స్ కి మాత్రం అది గుర్తులేదేమో.