తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు.
మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో ఒకరైన మమత పెళ్ళి జరగాల్సి ఉంది.ఇలా ఆత్మహత్య చేసుకోవడం కాలనీలో అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.