తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు… బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు.ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ను జనగామలో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్న సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా దీక్ష చేయాలని బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలోనే దీక్షకు కుర్చుకున్నారు.
అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేసి,బండి సంజయ్ని అరెస్ట్ చేశారు.బండి సంజయ్ ను స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.ఈ నేపథ్యంలోనే పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.