Breaking News
Home / SLIDER / బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్

బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ  బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో  చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఇందులో  బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయకులు భూములు కబ్జా చేస్తున్నారని బండి చేసిన ఆరోపణలపై స్పందించారు.

భూ ఆక్రమణలపై బీజేపీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తే విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను చెరువులు కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరి బీజేపీ నేతలు ఆక్రమించారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri