Home / BHAKTHI / తిరుమల ఆలయం మూసివేత

తిరుమల ఆలయం మూసివేత

డిసెంబర్‌ 25, 26 తేదీల్లో సూర్య గ్రహణం కారణంగా రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని భక్తులు అందరూ గమనించాలని ఆలయ అధికారులు తెలిపారు.భక్తులు ఈ విషయంలో సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat