మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ఇలా భాదపడాలని అన్నారు.చనిపోయినవారికి నాలుగు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వనున్నామని మంత్రి తెలిపాడు.
