Home / POLITICS / Political : మాండౌస్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

Political : మాండౌస్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

Political ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.. పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను ప్రభావంతో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు భారీగానే పడనున్నట్టు తెలుస్తుంది.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మీడియాతో సమీక్ష నిర్వహించి తుఫాను పరిస్థితులపై మాట్లాడారు..

మాండోస్ తుఫాను ప్రభావం పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఏవిధంగా ఉండని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.. అలాగే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వేరొక చోటికి తరలించాలని అన్నారు.. అవసరమైతే సత్వర చర్యలు చేపట్టాలని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పునరావాస శిబిరాలను తెరవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల వారికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.. అలాగే ఆదివారం కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. తుఫాను తీరం దాటినప్పటికీ ఆదివారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat